ఆదివారం నుంచి జూన్ నెల ప్రారంభం కానుంది. కొత్త బిజినెస్ రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. అవి.. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) ఓవర్నైట్ మ్యూచువల్ ఫండ్స్కి కొత్త కట్ ఆఫ్ టైమ్స్ ప్రకటించింది. ఆఫ్లైన్ లావాదేవీలకు 3 పీఎం, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి 7 పీఎం అని తెలిపింది. కొటక్ మహింద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు నయా నిబంధనలు వర్తిస్తాయి.

EPFO 3.0 సిస్టమ్ ప్రారంభంకాబోతోంది. దీంతో ATM లేదా UPI ద్వారా పీఎఫ్ వెనక్కి తీసుకోవచ్చు. యూపీఎఫ్ యాప్ల ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. క్లెయిమ్ ప్రాసెసింగ్, సమస్యల పరిష్కారం వంటి సేవలను తేలిగ్గా పొందొచ్చు. కంపెనీ ద్వారా ఫామ్ 16 పొందడానికి ఆఖరు తేదీ జూన్ 15. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయడంలో ఇది చాలా కీలకం. ఉద్యోగులు ఈ డాక్యుమెంట్ని తప్పకుండా పొందాలి. మైఆధార్ పోర్టల్ ద్వారా ఆధార్ను ఫ్రీగా అప్డేట్ చేసుకోవడానికి జూన్ 14 లాస్ట్ డేట్. తర్వాత పాతిక రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఆధార్ కేంద్రంలో అయితే 50 రూపాయలు చెల్లించాలి. ప్రతి నెలా తొలి రోజు ఆయిల్ సంస్థలు గ్యాస్ రేట్లను మారుస్తాయి. మే నెలలో ధరలు తగ్గాయి. జూన్ 1న సవరణ జరిగే ఛాన్స్ ఉంది. ఈ ఎఫెక్ట్ వంటింటి బడ్జెట్పై పడనుంది.
