హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ డీలిమిటేషన్ కమిటీలో సభ్యురాలిగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ అగ్ర నేత సోనియా గాంధీ, సీఎం రేవంత్, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.