Monday, October 20, 2025
spot_img

వైరా మాజీ ఎమ్మెల్యే మృతి

Must Read

ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్ గుండెపోటుతో మృతిచెందారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మదన్ లాల్ 2014 శాసన సభ ఎన్నికల్లో వైరా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అదే పార్టీ నుంచి బరిలో నిలిచినా ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి వైరా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహిస్తున్నారు.

సీఎం సంతాపం

బాణోత్ మదన్ లాల్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. మదన్ లాల్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This