Thursday, July 3, 2025
spot_img

ఏసీబీ వలలో సీనియర్‌ డ్రాఫ్ట్‌మెన్‌

Must Read

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‎లో సీనియర్‌ డ్రాఫ్ట్‌మెన్‌ జ్యోతిక్షేమాబాయి రూ.20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం, మహబూబాబాద్ పట్టణ శివారులోని మూడు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసేందుకు వరంగల్ జిల్లాకు చెందిన తాళ్ల కార్తీక్ భూమికి సంబంధించిన వివరాల కోసం గత నెల 28న కలెక్టరేట్‌లోని సర్వే, భూమి రికార్డుల విభాగంలో దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి సంబంధించి రూ. 05 వేలతో చలన తియ్యలని సీనియర్‌ డ్రాఫ్ట్‌మెన్‌ జ్యోతిక్షేమాబాయి చెప్పడంతో కార్తీక్ ఆమెకు రూ. 05 వేలు చెల్లించాడు. మళ్లీ రెండు రోజుల తర్వాత కార్తీక్ నక్ష కోసం కార్యాలయానికి రావడం జరిగింది. రూ.20 వేలు చెల్లిస్తేనే నక్ష వస్తుందని జ్యోతిక్షేమాబాయి చెప్పడంతో లంచం ఇవ్వడం ఇష్టంలేని కార్తీక్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రూ.20,000 లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS