Friday, July 4, 2025
spot_img

బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Must Read

పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్. కొత్తూర్ లో నిర్వహించిన శ్రీనాన్న కార్యక్రమంలో అయిన పాల్గొన్నారు. ఈ సంధర్బంగా పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ గడిచిన పది ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ పేదవారికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని అన్నారు.పార్లమెంటు ఎన్నికల్లో పాలేరు నుంచి అత్యధిక మెజారిటీ రాబోతుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఆసరా పెన్షన్ కూడా ఇవ్వలేదని తెలిపారు.ఇరవై రెండున్నర వేల కోట్లు ఖర్చు పెట్టి ఇందిరమ్మ ఇళ్ళు కట్టిస్తామని హామీ ఇచ్చారు.బీఆర్ఎస్ పార్టీ కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతుందని విమర్శించారు.వచ్చే ఏడాదిలోగా పాలేరులోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

Latest News

వార్షికోత్సవ శుభాకాంక్షలు

కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్ష‌రం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది. రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల ప‌రిష్కారానికి సాక్షిగా..నిలిచిన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS