Friday, September 19, 2025
spot_img

బీజేపీ సభ్యత్వాలు నమోదులో బౌద్ద నగర్ డివిజన్ ముందు వరుసలో ఉంది

Must Read
  • బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.రవి ప్రసాద్ గౌడ్

బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.రవి ప్రసాద్ గౌడ్ బౌద్ద నగర్ డివిజన్‎లోని పలు బస్తీల్లో పర్యటించి,వ్యాపారవేత్తలతో ఆన్లైన్ ద్వారా బీజేపీ పార్టీలో సభ్యులుగా చేర్పించడం జరిగింది.ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ,బౌద్దనగర్ డివిజన్‎లో బూత్ కమిటీ సభ్యులు,సీనియర్ నాయకులతో కలిసి పదివేల మందిని పార్టీలో చేర్పించే దిశగా ప్రయత్నిస్తానని తెలిపారు.బీజేపీ సభ్యత్వాలు నమోదు చేయించడంలో బౌద్ద నగర్ డివిజన్ ముందు వరుసలో ఉందని పేర్కొన్నారు.క్రియాశీల సభ్యులను కూడా అత్యధికంగా పార్టీలో చేర్పిస్తామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో దత్తు,నేతి సత్యనారాయణ,ఎన్.ఎస్.అజయ్,చిలకల సురేష్,సిహెచ్ వేణుగోపాల్,ఎం.వి.లక్ష్మణ్,బైరి సురేష్,గజరాజు పాల్,పవన్ నాయుడు,తదితరులు పాల్గొన్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This