Thursday, September 18, 2025
spot_img

కేటీఆర్ కి బండిసంజయ్ స్ట్రాంగ్ కౌంటర్

Must Read
  • ఇన్నాళ్ల తర్వాత కేటీఆర్ కి నేతన్నలు గుర్తొచ్చారా
  • 15 ఏళ్లుగా సిరిసిల్లకు కేటీఆర్ ప్రాతినిధ్యం వహించారు
  • బీఆర్ఎస్ హాయంలోనూ ఆకలి చావులు కొనసాగాయి
  • కేటీఆర్ రాసిన లేఖకు బండిసంజయ్ కౌంటర్

ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాసిన లేఖకు కేంద్రమంత్రి బండిసంజయ్ కౌంటర్ ఇచ్చారు.ఇన్నాళ్ళ తర్వాత కేటీఆర్ కు నేతన్నలు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు.సిరిసిల్లకు 15 ఏళ్లుగా కేటీఆర్ ప్రాతినిధ్యం వహించారని,వారి హాయంలోనూ ఆకలి చావులు కొనసాగాయని విమర్శించారు.నేతన్నలను సంక్షోభం నుండి ఎందుకు గట్టెక్కించలేకపోయారని నిలదీశారు.బతుకమ్మ బకాయిలు చెల్లించకుండా పవర్ లూం సంస్థలు మూతపడేలా చేశారని తెలిపారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ప్రకటించినప్పుడు సిరిసిల్ల గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.సిరిసిల్ల నేతన్నలను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని బండి సంజయ్ పేర్కొన్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This