Friday, September 19, 2025
spot_img

మోసం చేయడం జగన్ కి కొత్తేమి కాదు,షర్మిల హాట్ కామెంట్స్

Must Read

ఎక్స్ వేదికగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్ పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు.మోసం చేయడం జగన్మోహన్ రెడ్డికి కొత్తేమి కాదని,ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం జగన్ కే చెల్లిందని విమర్శించారు.మిమల్ని ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది సమస్యల పై మాట్లాడానికా,మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా అని ప్రశ్నించారు.మీ పాలనలో అవినీతి,అక్రమాలే జరిగాయని,అసెంబ్లీకి పంపిన ప్రజలను వింతగా మోసం చేయడం జగన్ కె చెల్లిందని ఆరోపించారు.అసెంబ్లీకి వేళ్ళని జగన్ తన పదవికి రాజీనామా చేయాలనీ డిమాండ్ చేశారు.అసెంబ్లీలో అడుగుపెట్టని జగన్ ప్రతిపక్ష హోదాకే కాకుండా ఎమ్మెల్యే పదవికి కూడా అర్హులు కాదని అన్నారు.గత ప్రభుత్వం పై ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల పై అసెంబ్లీలో సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కదా అని ప్రశ్నించారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This