Tuesday, July 1, 2025
spot_img

తెలంగాణ పై కేంద్రానిది కక్షసాధింపు : సీఎం రేవంత్ రెడ్డి

Must Read

తెలంగాణకు నిధులు ఇచ్చే బాధ్యత కేంద్రానికి లేదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.కేంద్రం ప్రకటించిన బడ్జెట్ పై స్పందించారు.ఈ సంధర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోదీని మూడుసార్లు కలిసిన లాభం లేకుండా పోయిందని అన్నారు.విభజన చట్టం వంకతో ఏపీకి నిధులు ఇచ్చారు కానీ అదే చట్టం ప్రకారం తెలంగాణకు ఎందుకు నిధులు ఇవ్వలేదు అని ప్రశ్నించారు.తెలంగాణ పై కేంద్రానిది కక్ష సాధింపు అని,ప్రధాని మోదీ మొదటి నుండే తెలంగాణ పై కక్ష చూపించారని విమర్శించారు.పెద్దన్న పాత్ర పోషించాలని ప్రధాని మోదీను పదే,పదే కోరిన లాభం లేకుండా పోయిందని తెలిపారు.కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో తెలంగాణ పదాన్నే నిషేదించారని మండిపడ్డారు.సభలో తెలంగాణ పదాన్ని పలకడానికి కూడా వారికి మనసు ఒప్పలేదని విమర్శించారు.తెలంగాణకు ఇంతటి విపక్ష ఎప్పుడు జరగలేదని,రాష్ట్ర ప్రజలకు బీజేపీ నాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.సబ్ కా సత్ సబ్ కా వికాస్ బీజేపీ బోగస్ నినాదామని,కేవలం వారికి కావాల్సింది ఓట్లు,సీట్లు మాత్రమేనని ఆరోపించారు.తెలంగాణకు జరిగిన అన్యాయం పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు.మాకు మద్దతు ఇవ్వండి,మీకు నిధులు ఇస్తాం అనేల బడ్జెట్ ఉందని మండిపడ్డారు.

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS