Thursday, July 3, 2025
spot_img

గ్రామపంచాయతీల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలి

Must Read
  • రాష్ట్ర సర్పంచుల సంఘం డిమాండ్

తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి పనులు చేసి నేటికీ బిల్లులు అందక నానా ఇబ్బందులు పడుతున్న సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సర్పంచుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గ్రామాలలో అభివృద్ధి అనే ఆకాంక్షతో వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డులు, సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాలువలు, వీధిలైట్ల నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ, క్రీడా ప్రాంగణాలు మొదలగు అనేక కార్యక్రమాలు విడతల వారీగా చేపట్టి ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దడంలో సర్పంచుల పాత్ర కీలకమని తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్యగౌడ్, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నర్సింహా రెడ్డి అన్నారు. ఎంతో కష్టపడి గ్రామాలను అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన, సర్పంచుల బిల్లుల చెల్లింపులలో గత, తాజా ప్రభుత్వాలు జాప్యం వహించి సర్పంచులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పెండింగ్ బిల్లుల విషయమై ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలు అందించిన కాగితానికే పరిమితమయ్యాయని అన్నారు. ఈమేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దగ్గర పడుతున్న నేపథ్యంలో సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులు విడుదల చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ఎన్నికల సంఘం కమిషనరు పార్థసారథికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ప్రనిల్ చందర్, ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, సముద్రాల రమేష్, పంబ కరుణాకర్, రామకృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS