Tuesday, September 16, 2025
spot_img

రేపే డీఎస్సి 2024 పరీక్షా, సూచనలు ఇవే

Must Read

తెలంగాణలో ఉపాధ్యాయ నియామకాలకు నిర్వహిస్తున్న డీఎస్సి 2024 పరీక్షా గురువారం నుండి ప్రారంభం కానున్నాయి.జులై 18 నుండి ఆగష్టు 05 వరకు జరిగే ఈ పరీక్షల కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి ఈ పరీక్షా జరగబోతుంది.మొత్తం 13 రోజులపాటు డీఎస్సి పరీక్షలు జరుగనున్నాయి.తెలంగాణ వ్యాప్తంగా 2,79,966 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాయనున్నారు పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాలో 56 కేంద్రాల్లో పరీక్షా నిర్వహించునున్నారు.మొత్తంగా రెండు విడతల్లో డీఎస్సి పరీక్షా నిర్వహిస్తున్నారు.ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు తోలి విడత,మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 వరకు రెండు విడత పరీక్ష నిర్వహిస్తారు.పీఈటీ,ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ వారికి ఉదయం 9నుంచి12 గంటల వరకు,మధ్యాహ్నం 2నుంచి5 గంటల వరకు పరీక్షా ఉంటుందని అధికారులు తెలిపారు.ఇప్పటికే 2 లక్షల మంది హల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు :

  • గంట ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి
  • గంటన్నర ముందు నుండే పరీక్షా కేంద్రంలోకి అనుమతి
  • హాల్ టికెట్,ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసారి
  • హ్యాండ్ వాచెస్,ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రాల్లోకీ అనుమతించారు
Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This