Monday, August 18, 2025
spot_img

ఇండియన్ ఆర్మీ చీఫ్ గా జనరల్ ఉపేంద్ర ద్వివేది

Must Read

ఇండియన్ ఆర్మీ చీఫ్ గా జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు స్వీకరించారు.ఉపేంద్ర ద్వివేది ఇప్పటివరకు ఆర్మీ స్టాఫ్ చీఫ్ గా పని చేశారు.2022 మే నుంచి ఆర్మీ చీఫ్ గా ఉన్న జనరల్ మనోజ్ పండే పదవీ విరమణ చేయడంతో అయిన స్థానంలో ఉపేంద్ర ద్వివేది ని నియమించారు.పరమ విశిష్ట సేవా పతకం,అతి విశిష్ట సేవా పతకం,మూడు జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్‌ఛార్జ్‌ కమెండేషన్ కార్డ్‌లతో పాటు మరెన్నో పతకాలను ఉపేంద్ర ద్వివేది అందుకున్నారు.మధ్యప్రదేశ్ కి చెందిన ఉపేంద్ర ద్వివేది సైనిక్ స్కూల్ లో చదివారు.ఆ తరువాత 1981లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో చేరి 1984 లో జమ్మూకాశ్మీర్ రైఫిల్స్ కి చెందిన 18వ బెటాలియన్ లోకి అడుగుపెట్టారు. కాశ్మీర్ లోయ,రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతాల్లో కూడా పనిచేశారు.అస్సాం రైఫిల్స్ లో కమాండర్ గా ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడంలో విశేష సేవలు అందించారు.ఇండియన్ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన ఉపేంద్ర ద్వివేదికి అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS