Friday, July 4, 2025
spot_img

గాజులరామారం లో జరిగిన ఘటన పై జిహెచ్ఎంసి కమిషనర్ సీరియస్

Must Read
  • ఇద్దరు ఎస్ఎఫ్ఏ లను విధుల నుంచి తొలగించిన జోనల్ కమిషనర్

కూకట్ పల్లి జోన్ గాజులరామారం సర్కిల్ లో మహిళ శానిటేషన్ వర్కర్ పై లైంగిక వేధింపుల వార్తల పై జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన పై పూర్తి వివరాలు సేకరించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూకట్ పల్లి జోనల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, మెడికల్ ఆఫీసర్ ల తో విచారణ జరిపించారు వారు నివేదిక అందించడంతో కఠినమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. దీంతో శానిటేషన్ సూపర్వైజర్ లు పి.కిషన్, సిహెచ్. ప్రణయ్ లను విధుల నుండి జోనల్ కమిషనర్ తొలగించారు. పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జి హెచ్ ఎం సి కమిషనర్ హెచ్చరించారు.

Latest News

పాకిస్థాన్‌ జట్టు భారత్‌కు రావొచ్చు

భారత క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడి 2025 ఆసియా హాకీ టోర్నమెంట్‌కు భారత్‌(India) ఆతిథ్యమివ్వనుంది. ఈ టోర్నమెంట్‌లో ఆగస్టు 27న ప్రారంభమై సెప్టెంబర్‌ 7న ముగుస్తుంది. భారత్‌లోని...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS