Wednesday, September 10, 2025
spot_img

శ్రీవారి భక్తులకు శుభవార్త

Must Read

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఏడుకొండలవాడి దర్శనార్థం శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన కొండ మీదికి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ).. అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో దివ్యదర్శనం టోకెన్లను జారీ చేస్తోంది. ఈ ప్రక్రియను శుక్రవారం (జూన్ 6) నుంచి ప్రారంభించింది. దివ్యదర్శనం టోకెన్ కేంద్రాన్ని శ్రీవారి మెట్టు నుంచి ఇక్కడికి మార్చడంపై భక్తుల నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. శ్రీనివాస మంగాపురం ఆలయంలో కౌంటర్ల ఏర్పాటుకు భారత పురావస్తు శాఖ అనుమతి రావాల్సి ఉంది. ఈ మేరకు కొంత సమయం పడుతుంది. అందువల్ల భక్తుల సౌకర్యార్థం టోకెన్ కౌంటర్లను తాత్కాలికంగా భూదేవి కాంప్లెక్స్‌కు మార్చారు. ఈ కాంప్లెక్స్‌లో ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎస్ఎస్డీ టోకెన్ల జారీకి కావాల్సిన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు ఉన్నాయి.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This