Thursday, July 24, 2025
spot_img

శ్రీవారి భక్తులకు శుభవార్త

Must Read

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఏడుకొండలవాడి దర్శనార్థం శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన కొండ మీదికి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ).. అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో దివ్యదర్శనం టోకెన్లను జారీ చేస్తోంది. ఈ ప్రక్రియను శుక్రవారం (జూన్ 6) నుంచి ప్రారంభించింది. దివ్యదర్శనం టోకెన్ కేంద్రాన్ని శ్రీవారి మెట్టు నుంచి ఇక్కడికి మార్చడంపై భక్తుల నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. శ్రీనివాస మంగాపురం ఆలయంలో కౌంటర్ల ఏర్పాటుకు భారత పురావస్తు శాఖ అనుమతి రావాల్సి ఉంది. ఈ మేరకు కొంత సమయం పడుతుంది. అందువల్ల భక్తుల సౌకర్యార్థం టోకెన్ కౌంటర్లను తాత్కాలికంగా భూదేవి కాంప్లెక్స్‌కు మార్చారు. ఈ కాంప్లెక్స్‌లో ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎస్ఎస్డీ టోకెన్ల జారీకి కావాల్సిన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు ఉన్నాయి.

Latest News

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే పిఎ హరిబాబు రిమాండ్‌

డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తానని 83 మంది వద్ద నుంచి రూ.84 లక్షల వ‌ర‌కు వసూలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS