Sunday, September 7, 2025
spot_img

హైదరాబాద్ లో భారీగా గ‌*జాయి స్వాధీనం

Must Read

హైదరాబాద్ లో భారీగా గ‌*జాయి పట్టుబడింది. ఒడిశా నుండి మహారాష్ట్రకు గ‌*జాయి తరలిస్తున్నారన్న సమాచారంతో పెద్ద అంబర్‎పేట్ ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించి 170 కిలోల గ‌*జాయి స్వాధీనం చేసుకున్నారు. పక్క సమాచారంతోనే తనిఖీలు నిర్వహించి 170 కిలోల గ‌*జాయి స్వాధీనం చేసుకున్నామని, 08 మందిని అరెస్ట్ చేశామని ఎక్సైజ్ ఎన్‎ఫోర్స్‎మెంట్ జాయింట్ డైరెక్టర్ ఖురేషీ తెలిపారు. మల్కాజ్‎గిరిలో గ‌*జాయిని ప్యాక్ చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు విచారణలో తేలిందని వెల్లడించారు. పట్టుబడ్డ గ‌*జాయి విలువ రూ.34 లక్షలు ఉంటుందని తెలిపారు.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This