Wednesday, September 17, 2025
spot_img

కోమటికుంటలో అక్రమ నిర్మాణాల తొలగింపు

Must Read

ప్రకృతి రిసార్ట్స్‌, ప్రకృతి కన్వెన్షన్‌ను తొలగించిన హైడ్రా..

మేడ్చ‌ల్ – మల్కాజిగిరి జిల్లా, తూముకుంట మున్సిపాలిటీ, దేవరయాంజల్‌ గ్రామంలోని కోమటి కుంటలో గురువారం అక్రమ కట్టడాలను తొలగించింది హైడ్రా. కోమటికుంటలోని ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మాణాలపై హైడ్రాకు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి… ఇరిగేషన్‌, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో పూర్తి స్థాయి విచారణ చేపట్టిన హైడ్రా. కోమటి కుంట చెరువు పరిధిలో నిర్మించిన ప్రకృతి రిసార్ట్స్‌, ప్రకృతి కన్వెన్షన్‌కు ఎలాంటి నిర్మాణ అనుమతులు లేవని వెల్లడించారు..అలాగే చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనే ఈ నిర్మాణాలు జరిగినట్టు వెల్లడి కావడంతో కూల్చివేతలకు హైడ్రా ఆదేశాలు జారీ చేసింది.. హైడ్రా నోటీసులపై ప్రకృతి రిసార్ట్స్‌, ప్రకృతి కన్మెన్షన్‌ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. ఇరిగేషన్‌, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మించిన వాటిని కూల్చివేయాలంటూ హైకోర్టు తీర్పునిచ్చింది.. కాగా తామే తొలగిస్తామని.. 30 రోజుల సమయం కావాలని హైకోర్టును కోరారు ప్రకృతి రిసార్ట్స్‌, ప్రకృతి కన్మెన్షన్‌ ప్రతినిధులు. 30 రోజులు దాటినా వాటిని తొలగించక పోవడంతో గురువారం హైడ్రా నేరుగా రంగంలోకి దిగి కూల్చివేతలు నిర్వహించింది.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This