Wednesday, August 20, 2025
spot_img

11 చోట్ల ఇండియా కూటమిదే హవా,సంబరాల్లో కార్యకర్తలు

Must Read

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.ఉదయం ప్రారంభంమైన కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది.మరోవైపు పలు స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు.13 అసెంబ్లీ స్థానాల్లో 11 చోట్ల ఇండియా కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.పంజాబ్ జలంధర్ లో 37వేల 325 ఓట్ల తేడాతో అప్ అభ్యర్థి విజయం సాధించారు.దీంతో ఆ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.బెంగాల్ లో 4 స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో టీంఎంసి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.ఇక హిమాచల్ ప్రదేశ్ లో 03 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉండగా,మధ్యప్రదేశ్ లో 01,జార్ఖండ్ లో 02 స్థానాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.ఇక తమిళనాడు లో 01 స్థానానికి ఉప ఎన్నిక జరగగా ఆ ఒక్క స్థానంలో డీఎంకే అభ్యర్థి ముందంజలో ఉన్నారు.దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇండియా కూటమి,కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తుండడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

Latest News

ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్ దాఖ‌లు

ఉపరాష్ట్రపతి అభ్య‌ర్థిగా సీపీ రాధాకృష్ణన్ వెంట‌వ‌చ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో బుధవారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS