Thursday, September 18, 2025
spot_img

JEE అడ్వాన్స్ 2024 ఫలితాలు విడుదల

Must Read

జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి.మే 26న దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు జరగగా ఈరోజు ఉదయం ఫలితాలను ప్రకటించారు.ఈ పరీక్షలో మొత్తం 48,248 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.అర్హత సాధించిన వారిలో 7,964 మంది మహిళలు ఉన్నారు.పరీక్షకు హాజరైన అభర్ధులు అధికార వెబ్ సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.ఈ ఫలితాలలో ఐ.ఐ.టీ ఢిల్లీకి చెందిన వేద్ లా హుతీ 355 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. ఐ.ఐ.టీ ఢిల్లీకి చెందిన భోగాలపల్లి సందేశ్ 338 మార్కులతో రెండవ స్థానంలో నిలిచాడు.పుట్టి కుశాల్ కుమార్ కి 334 మార్కులు,రాజ్‌దీప్ మిశ్రాకి 333 మార్కులు,ద్విజా ధర్మేష్‌కుమార్ పటేల్ కి 332 మార్కులు,డూరు తేజేశ్వర్ కి 331 మార్కులు వచ్చాయి.కౌన్సలింగ్ కోసం రేపటి నుండి రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This