Thursday, September 18, 2025
spot_img

త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన జిందాల్ వరల్డ్ వైడ్ లిమిటెడ్

Must Read

ప్రపంచంలోనే అతిపెద్ద డెనిమ్ ఫ్యాబ్రిక్ తయారీదారుల్లో ఒకటైన జిందాల్ వరల్డ్‌వైడ్ లిమిటెడ్ (బిఎస్ఈ: 531543, ఎన్ఎస్ఈ: జిందాల్ వరల్డ్ వైడ్ ), సంస్థ, 2024 సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికం, అర్థ సంవత్సరానికి సంబంధించి తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. 2024 సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో, ఆపరేషన్ల ద్వారా ఆదాయం 45.70 శాతం వృద్ధి చెంది, రూ. 5708 మిలియన్‌కు చేరుకుంది. ఫినిష్డ్ ఫ్యాబ్రిక్‌కు గల దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న డిమాండ్ ఈ వృద్ధికి ప్రాముఖ్య కారణం. ఏబిటా 38.30శాతం వృద్ధి చెంది రూ. 484 మిలియన్‌కు చేరుకుంది, ఆపరేషనల్ లాభదాయకతలో మెరుగుదలను చూపింది. పిఏటి 35.2 శాతం వృద్ధి చెంది, గత ఏడాది క్యూ2ఎఫ్ వై 24లో రూ. 128 మిలియన్‌గా ఉండగా, ఈ ఏడాది క్యూ2ఎఫ్ వై 25లో రూ. 173 మిలియన్‌కు చేరింది. 2024 సెప్టెంబర్ 30తో ముగిసిన అర్థ సంవత్సరానికి, ఆపరేషన్ల ద్వారా ఆదాయం 31.9 శాతం వృద్ధితో రూ. 10,582 మిలియన్‌గా ఉంది. ఏబిటా 23.2 శాతం వృద్ధి చెంది రూ. 950 మిలియన్‌గా ఉంది. పిఏటి 34.1శాతం వృద్ధి చెంది రూ. 354 మిలియన్‌గా ఉంది. 1986లో డాక్టర్ యమునాదత్ అగర్వాల్ స్థాపించిన జిందాల్ వరల్డ్‌వైడ్, త్రెండ్ల మార్పులతో, ఆధునిక సాంకేతికతతో నూతన ఆవిష్కరణల ద్వారా తన ఉత్పత్తులను పునరావిష్కరిస్తూ వస్తోంది. ఈ సంస్థ గుజరాత్‌లోని 4 ఆధునిక మాన్యు ఫ్యాక్చరింగ్ యూనిట్లతో విస్తరించి ఉంది. తాజా ప్రయత్నంగా, ఈ సంస్థ ద్విచక్ర విద్యుత్ వాహన రంగంలో ప్రవేశించడంతో వైవిధ్యమైన వ్యాపార అవకాశాలను అన్వేషిస్తోంది.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This