Friday, September 19, 2025
spot_img

ట్రంప్ పై కీలక వ్యాఖ్యలు చేసిన జో బైడెన్

Must Read

అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అగ్రరాజ్యం అమెరికాలో పొలిటికల్ హిట్ పెరిగింది.నవంబర్ 5,2024లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలోనే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్,అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్సపర ఆరోపణలు చేసుకున్నారు.వీరిద్దరూ అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం,ద్రవ్యోల్బణం సహా ఇతర కీలక అంశాల పై ఇద్దరు నేతలు ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ నేరస్తుడని,అబద్ధాలకోరని బైడెన్ విమర్శించారు.బైడెన్ చేసిన విమర్శల పై మాజీ అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు.బైడెన్ కుమారుడు పెద్ద క్రిమినల్ అని ఆరోపించారు.వయసు పెరగడం వల్ల బైడెన్ ఎం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కావడం లేదని అన్నారు.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపడం కోసం బైడెన్ ఎలాంటి ప్రయత్నం చేయలేదని తెలిపారు.యుద్ధం పెంచడానికే బైడెన్ పనిచేశారని ఆరోపించారు.తాను అమెరికాకి అధ్యక్షుడిగా ఉంటే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అసలు జరిగేదె కాదని ట్రంప్ తెలిపారు.ట్రంప్ చేసిన వ్యాఖ్యల పై బైడెన్ స్పందిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధ నేరస్తుడని ఆరోపించారు.ట్రంప్‌ కి అడల్ట్ స్టార్‌తో ఎఫైర్ ఉందని విమర్శించారు.క్యాపిటల్ హిల్ అల్లర్ల కేసులో ట్రంప్ దోషి అని బైడెన్ పేర్కొన్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This