Wednesday, August 20, 2025
spot_img

విద్యుత్ విచారణ కమిషన్ నూతన చైర్మన్ గా జస్టిస్ మధన్ భీంరావు

Must Read
  • సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నూతన చైర్మన్ ను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ విద్యుత్ కుంభకోణం పై విచారణ కోసం కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మధన్ భీంరావు లోకుర్ నియమితులయ్యారు.సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మధన్ భీంరావును కమిషన్ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది.మధన్ భీంరావు ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టుగా సీజేగా,సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్ గఢ్ నుండి విద్యుత్ కొనుగోలు,యాదాద్రి థర్మల్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది.ఈ కమిషన్ కి చైర్మన్ గా జస్టిస్ ఎల్.నర్సింహా రెడ్డిను నియమించింది.కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ మాజీముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.విచారణ చేపట్టిన ధర్మాసనం చైర్మన్ ని మార్చాలని ఆదేశించింది.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నూతన చైర్మన్ గా జస్టిస్ మధన్ భీంరావును నియమించింది రాష్ట్ర ప్రభుత్వం.

Latest News

ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్ దాఖ‌లు

ఉపరాష్ట్రపతి అభ్య‌ర్థిగా సీపీ రాధాకృష్ణన్ వెంట‌వ‌చ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో బుధవారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS