Wednesday, June 18, 2025
spot_img

నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరు : కేసీఆర్

Must Read

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు.ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వదిలి వెళ్లారని తెలిపారు.పార్టీలో మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్ళిపోతారని, అలాంటి వారితో పార్టీకి ఎలాంటి నష్టం లేదని అన్నారు.కార్యకర్తలు ఎవరు అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు.నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరని,పార్టీయే నాయకులని తయారు చేస్తుందని వెల్లడించారు.తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలు పార్టీ మారడం ఓ లెక్కన అని ఎద్దేవా చేశారు.రెట్టింపు ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామని నాయకులకు సూచించారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,ఎమ్మెల్యే పాడి కౌశిక్,ఎమ్మెల్సీ ఎల్.రమణ ఇతర నాయకులు పాల్గొన్నారు.

Latest News

ఏటీఎమ్‌లలో పెరిగిన వంద, 2 వందల నోట్ల లభ్యత

ఏటీఎమ్‌లలో వంద, రెండు వందల నోట్ల లభ్యత పెరిగింది. ఏటీఎమ్‌లలో ఆ డినామినేషన్‌ నోట్లను సెప్టెంబర్ 30లోపు మరింత ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS