Thursday, September 18, 2025
spot_img

మరోసారి భద్రత బలగాల బేస్ క్యాంప్‎పై మావోయిస్టుల దాడి

Must Read

ఛత్తీస్‎గడ్‎లోని బీజాపూర్ జిల్లాలో భద్రత బలగాల బేస్ క్యాంప్‎పై మావోయిస్టులు మరోసారి దాడి చేశారు. ఆదివారం తెల్లవారుజామున బీజాపూర్ జిల్లాలోని పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిపల్లి 02 పోలీస్ బేస్ క్యాంప్‎పై మావోయిస్టులు దాడి చేశారు. ఈ క్రమంలో భద్రత బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. సమీప ఆసుపత్రికి తరలించి గాయపడిన జవాన్లకు చికిత్స అందిస్తున్నారు. ఈ దాడుల వెనుక హిద్మా హస్తం ఉన్నట్లు సమాచారం. గత మూడు రోజుల్లో భద్రత బలగాలపై మావోయిస్టులు దాడులు చేయడం ఇది రెండోసారి.

శుక్రవారం కూడా బీజాపూర్ జిల్లాలోని జీడిపల్లిలో భద్రత దళాల బేస్ క్యాంప్‎పై మావోలు దాడి చేశారు. అప్రమత్తమైన బలగాలు వెంటనే కౌంటర్ ఇచ్చాయి. అర్ధరాత్రి నుండి భద్రత బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This