Thursday, September 18, 2025
spot_img

ఫిబ్రవరి 14న నిదురించు జహాపన టీజర్ రిలీజ్

Must Read

ప్రేమించుకుందాం రా, సూర్యవంశం, మనసంతా నువ్వే లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులని అలరించిన పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ వర్ధన్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ వర్ధన్ హీరోగా ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకత్వంలో ఏఆర్ ఎంటర్ టైన్మెంట్స్ పై సామ్ నిర్మిస్తున్న యూనిక్ ఎంటర్ టైనర్ ‘నిదురించు జహాపన’. నవమి గయాక్, రోష్ని సాహోతా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ టీజర్ ని రిలీజ్ చేశారు. మనిషి నిద్రపోయే వరకు సైన్స్ అయితే నిద్రపోయాక ఏం జరుగుతుందనేది మాయ’ అనే వాయిస్ ఓవర్ మొదలైన టీజర్ చాలా గ్రిప్పింగా వుంది. కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ అన్నీ చాలా యూనిక్ గా వున్నాయి. ఆనంద్ వర్ధన్ స్క్రీన్ ప్రజెన్స్ చాలా ఎట్రాక్టివ్ గా వుంది. ఆనంద్ వర్ధన్ నవమి గయాక్, రోష్ని సాహోతా మధ్య లవ్ స్టొరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. డైరెక్టర్ ప్రసన్న కుమార్ దేవరపల్లి మైండ్ బెండింగ్ స్క్రీన్ ప్లే, కాన్సెప్ట్ తో సినిమాని తీర్చిదిద్దారని టీజర్ ప్రామిస్ చేస్తోంది. అనూప్ రూబెన్స్ బీజీఎం ఎమోషన్ ని మరింత ఎలివేట్ చేసింది. టీజర్ సినిమాపై చాలా క్యురియాసిటీ క్రియేట్ చేసింది

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This