Thursday, September 18, 2025
spot_img

యూపీలో తొక్కిసలాట,100 మందికి పైగా భక్తులు మృతి

Must Read

యూపీలో ఘోరం చోటుచేసుకుంది.మంగళవారం రతీభాన్‌పూర్‌లో పరమశివుడి ముగింపు ఉత్సవాల్లో తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో సుమారుగా 100 మందికి పైగా భక్తులు మరణించినట్టు అధికారులు వెల్లడించారు.పెద్దసంఖ్యలో చిన్నారులు,మహిళలు గాయపడ్డారు.ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.ఉన్నట్టుండి ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో భక్తులు భయాందోళనకు గురై,పరుగులు తీశారు.ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.గాయపడిన వారిని ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నామని,మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.ఘటన జరిగిందని తెలుసుకున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంటనే ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు.అధికారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు.క్షతగ్రాతులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This