Monday, September 15, 2025
spot_img

పార్లమెంట్‎లో విపక్షాల రచ్చ.. ఉభయసభలు రేపటికి వాయిదా

Must Read

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతుంది.
గౌతం ఆదానీ అవినీతి, సంభాల్‎లో చెలరేగిన హింస తదితర అంశాలపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షలు పట్టుబట్టడంతో ఉభయ సభల సమావేశాలకు అంతరాయం కలుగుతుంది. సోమవారం కూడా పార్లమెంట్ లో ఇదే పరిస్థితి కొనసాగింది.

సోమవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆదానీ, సంభాల్‎లో జరిగిన హింసాకాండపై చర్చకు విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.విపక్షాల ఆందోళనలతో సభలను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు లోక్‎సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‎ఖర్ ప్రకటించారు. తిరిగి సమావేశాలు ప్రారంభం కాగానే విపక్షాలు మళ్లీ నిరసన తెలిపాయి. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని విపక్ష సభ్యులను లోక్‎సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ కోరారు. విపక్షాల ఆందోళనలతో ఉభయసభలను రేపటికి వాయిదా పడ్డాయి.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This