Sunday, May 18, 2025
spot_img

కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

Must Read

ఏపీ డిప్యూటీ సీఎంగా ఇటీవలే బాద్యతలు చేపట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.ఉదయం హైదరాబాద్ నుండి రోడ్డు మార్గం ద్వారా కొండగట్టుకి చేరుకున్నారు.పవన్ కళ్యాణ్ ని చూసేందుకు అభిమానులు,స్థానికులు భారీగా తరలివచ్చారు.డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా కొండగట్టుకి వచ్చిన పవన్ కళ్యాణ్ కు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.

హైదరాబాద్ నుండి రోడ్డు మార్గన కొండగట్టు దర్శననికి బయలుదేరిన పవన్ కళ్యాణ్ ను అభిమానులు దారిపొడువున పూలతో స్వాగతం పలికారు.అభిమానులకు అభివాదం చేస్తూనే అయిన కొండగట్టుకి బయలుదేరారు.ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో పవన్‌ కల్యాణ్‌ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు.11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఈ దీక్షను పాటించనున్నారు.పవన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS