Wednesday, September 17, 2025
spot_img

ఎట్టిపరిస్థితిలో పోచారం,సంజయ్ ల సభ్యత్వాలు రద్దు చేస్తాం

Must Read

-బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలైన పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయించి తీరుతామని అన్నారు మాజీమంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.ఎమ్మెల్యేలు పార్టీ మారడం పై తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పోచారం శ్రీనివాస్,సంజయ్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడం చట్ట విరుద్ధమని తెలిపారు.పార్టీ మారిన ఎమ్మెల్యేల పై స్పీకర్ కి పిటిషన్ ఇచ్చేందుకు గత రెండు రోజుల నుండి ప్రయత్నిస్తున్న స్పీకర్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని వెల్లడించారు.పార్టీ మారడం పై చట్టం ఉందని,చట్టం ఉందని తెలిసిన పార్టీ మారడం సరైన పద్దతి కాదని అన్నారు.చట్టం ప్రకారం పోచారం,సంజయ్ ల సభ్యత్వాలు రద్దు చేస్తామని తెలిపారు.స్పీకర్ నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో తప్పని పరిస్థితిలో స్పీడ్ పోస్టు ద్వారా స్పీకర్ కి పిటిషన్ పంపమని జగదీష్ రెడ్డి తెలిపారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This