Sunday, June 1, 2025
spot_img

వాజ్‌పేయ్‌కు ప్రముఖుల నివాళి

Must Read

దివంగత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ’సదైవ్‌ అటల్‌’ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. దేశానికి వాజ్‌పేయి చేసిన స్మారక సేవలను, ఆయనతో దిగిన ఫోటోలను ఈ సందర్భంగా ప్రధాని పంచుకున్నారు. ‘ఈ రోజు డిసెంబర్‌ 25 మనందరికీ చాలా ప్రత్యేకమైన రోజు. మన దేశ మన ప్రియతమ మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతిని జరుపుకుంటున్నాం. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచే రాజనీతిజ్ఞుడిగా ఆయన నిలిచారు‘ అంటూ మోదీ పేర్కొన్నారు. ఇక, ప్రదానితోపాటు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, పలువురు కేంద్రమంత్రులు, రాజకీయ నాయకులు వాజ్‌పేయికి నివాళులర్పించారు.

Latest News

డల్లాస్‌లో బీఆర్ఎస్ రజతోత్సవాలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సైతం అమెరికాలోని డల్లాస్‌లో ఇవాళ (జూన్ 1న) బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS