Thursday, September 18, 2025
spot_img

రాత్రి వేళలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

Must Read

టిప్పర్‌ లారీల్లో అక్రమ ఇసుక రవాణా ఇతర జిల్లాలకు తరలింపు

ఇసుక అక్రమ దందాకు కొందరు ప్రభుత్వ అధికారుల, అధికార పార్టీ నాయకుల అండదండలున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాను, వారి ఆగడాలతో జరుగుతున్న ప్రమాదాలను నియంత్రించాల్సిన పోలీసు, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. నిత్యం అన్ని రహదారులపై పోలీసులు గస్తీ తిరుగుతుండటం, మరో వైపున రెవెన్యూ, మైనింగ్‌ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ ఈ అక్రమ ఇసుక దందా ఎలా కొనసాగుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ఇసుక డంపుల నుంచి దూర ప్రాంతాలకు రాత్రి వేళ లారీల్లో తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు ఇసుక దందాకు పూర్తి మద్దతు ఇస్తుండటంతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ చట్టాలను, ఆదేశాలను అమలు చేయాల్సిన అధికారులు కొందరు అక్రమార్కులతో చేతులు కలపడంతో ఇసుకమా ఫియా ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుకఅక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This