Wednesday, September 17, 2025
spot_img

రుణామాఫీపై చర్చకు సిద్ధం

Must Read
  • సీఎం రేవంత్ రెడ్డి

గతంలో దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే రైతులకు రూ.2 లక్షల పంట రుణామాఫీ చేసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శనివారం మహబూబ్‎నగర్‎లో నిర్వహించిన రైతు పండుగ ముగింపు వేడుకలకు అయిన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 25 లక్షల రైతు కుటుంబాలకు రూ.21 వేల కోట్ల రుణామాఫీ చేశామని తెలిపారు. రుణామాఫీపై చర్చకు సిద్ధమని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనాలో రైతులు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నాయకులకు నిదపట్టడం లేదని వ్యాఖ్యనించారు. మహబూబ్‎నగర్ జిల్లాపై పగబట్టి అభివృద్దిని అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.

లగచర్ల ప్రజలు మాయగాళ్ల మాటలు విని కేసుల్లో ఇరుక్కొవద్దని సూచించారు. కోడంగల్‎లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసి 25 వేల మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This