Wednesday, June 18, 2025
spot_img

స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తాం

Must Read
  • సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో అన్ని రకాల క్రీడలను ప్రోత్సహిస్తూ,క్రీడాకారులకు సహకారం,ఉద్యోగ భద్రతా కల్పించేలా దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.గతంలో ఎప్పుడు లేని విధంగా బడ్జెట్ లో క్రీడల ప్రోత్సహానికి రూ.321 కోట్లు కేటాయించామని తెలిపారు.క్రీడల్లో రాణిస్తే ఉన్నత ఉద్యోగం,కుటుంబం గౌరవం పెరుగుంతుందనే నమ్మకాన్ని యువతలో కలిగిస్తామని పేర్కొన్నారు.నెట్ జీరో సిటీలో స్కిల్ యూనివర్సిటీ,హెల్త్ హబ్,ఎడ్యుకేషన్ హబ్ తోపాటు స్పోర్ట్స్ హబ్ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని,రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ స్పోర్ట్స్ కార్యక్రమాలు పెరిగేలా క్రీడా ప్రాంగణాల నిర్మాణానికీ ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని వెల్లడించారు.శాసనసభ్యులు కూడా క్రీడాస్ఫూర్తిని చాటుకునేలా ఇకపై ప్రతి బడ్జెట్ సెషన్ లో కార్యక్రమాలు నిర్వహించే సంప్రదాయాన్ని పునరుద్ధరించే అంశంపై అఖిలపక్షంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Latest News

ఏటీఎమ్‌లలో పెరిగిన వంద, 2 వందల నోట్ల లభ్యత

ఏటీఎమ్‌లలో వంద, రెండు వందల నోట్ల లభ్యత పెరిగింది. ఏటీఎమ్‌లలో ఆ డినామినేషన్‌ నోట్లను సెప్టెంబర్ 30లోపు మరింత ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS