Thursday, September 18, 2025
spot_img

తెలంగాణలో టీడీపీ ని బలోపేతం చేస్తాం

Must Read
  • ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

రానున్న రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.ఆదివారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయిన పాల్గొన్నారు.ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసి ముందుకెళ్తేనే అభివృద్ధి జరుగుతుందని,గొడవలు పెట్టుకుంటే సమస్యలు పరిష్కారం కావని తెలిపారు.సానుకూల చర్చల వల్లే రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించుకోవాలని వెల్లడించారు.తెలుగు జాతి ఐక్యతంగా ఉండాలన్నదే తన లక్ష్యమని అన్నారు.రానున్న రోజుల్లో తెలంగాణలో తెలుగు దేశం పార్టీ పోటీ చేస్తుందని పేర్కొన్నారు.

ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది.ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు
తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తూ రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి,విభజన అంశాల పై చర్చించుకుందాం అంటూ లేఖ రాసిన విషయం తెలిసిందే.దింట్లో భాగంగానే శనివారం జులై 06 న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజాభవన్ లో సమావేశమయ్యారు.పలు విషయాల పై చర్చించారు.అనంతరం ఆదివారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This