Tuesday, September 16, 2025
spot_img

రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిద్దాం

Must Read
  • చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ లకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
  • చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో కొనసాగాలి
  • సమస్యలు పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథం వైపు కొనసాగుదాం
  • చంద్రబాబు ప్రమాణస్వీకారానికి రేవంత్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలుపొందారు.ఇక పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ తో గెలిచి తోలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు.ఈ సందర్బంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.ఎపి ఎన్నికల్లో భారీ విజయం సాధించడంతో వారికీ అభినందనలు తెలియజేసి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగించి,సమస్యలు పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథం వైపు కొనసాగుదామని పేర్కొన్నారు.ఇదిలా ఉంటే ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోవడంతో వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This