Thursday, September 18, 2025
spot_img

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు హార్థీక శుభాకాంక్షలు

Must Read
  • మల్లన్న గెలుపు’లో భాగస్వాములు అయినా పట్టభద్రులందరికి ధన్యవాదాలు.
  • తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు అచ్ఛునూరి కిషన్

హైదరాబాద్‌లోని క్యూ న్యూస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ను మర్యాదపూర్వకంగా కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలిపి శాలువా’తో సన్మానించడం జరిగింది. అనంతరం క్యూ న్యూస్ కార్యాలయంలో క్యూ న్యూస్ కో & యాంకర్ సుదర్శన్ గౌడ్, మేనం శ్యాం తో కలిసి ఎమ్మెల్సీ గా విజయ ఢంకా మోగించిన తీన్మార్ మల్లన్న గెలుపు లో భాగంగా క్యూ న్యూస్ ఆఫిస్ లో కేక్ కట్ చేసి ఘనంగా సంబురాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తీన్మార్ మల్లన్న గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.. పట్టభద్రుల ఆశయాలు నెరవేర్చే విధంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పెద్దల సభలో మీ గొంతుక గా నిలిచి, మీ సమస్యల సాధనకై కృషి చేస్తారని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో జనగాం జిల్లా తీన్మార్ మల్లన్న టీమ్ సీనియర్ నాయకులు తుప్పతి శ్రీనివాస్, వనపర్తి జిల్లా తీన్మార్ మల్లన్న టీమ్ జిల్లా అధ్యక్షుడు దండే విజయ్ యాదవ్, మచ్ఛ సందీప్, బండారి ప్రవీణ్, శంకబుద్ధి భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This