Wednesday, September 3, 2025
spot_img

గాజాపై ఇజ్రాయెల్ దాడి..26 మంది మృతి

Must Read

గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ సరిహద్దులోని బీట్ లాహియాలో దాడులు జరిగాయి. ఈ దాడిలో 19 మంది మరణించారు.మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 08 మంది ఉండటం గమనార్హం. మరోవైపు సెంట్రల్ గాజాలోని ఓ శిబిరంపై దాడి జరిగింది. ఈ దాడిలో ఏడుగురు మృతి చెందారు.

అయితే ఈ దాడికి సంబంధించి ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. గత ఏడాది అక్టోబర్ 07న ఇజ్రాయెల్‎పై హమాస్ దాడి చేయడంతో సుమారు 1,200 మంది మరణించారు. దీనికి ప్రతికరంగా ఇజ్రాయెల్ ఇప్పటివరకు జరిపిన దాడుల్లో 40 వేల మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు.

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS