Thursday, June 26, 2025
spot_img

కోకాపేట టెక్‌ పార్క్‌లో భారీ అగ్నిప్రమాదం

Must Read
  • పలువురు ఐటి ఉద్యోగులకు ప్రమాదం
  • హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

హైదరాబాద్‌లోని కోకాపేట టెక్‌ పార్క్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు ఐటీ ఉద్యోగులకు తీవ్రగాయాలు కాగా, కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, బిల్డింగ్‌లోని రెస్టారెంట్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలినట్లు అనుమానిస్తున్నారు. ఈ పేలుడు కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్‌లో వందలాది మంది ఉద్యోగులు ఉండటంతో అప్రమత్తమైన అధికారులు వారిని వెంటనే తగిన చర్యలు తీసుకొని బయటకు తరలించారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించింది. రక్షణ చర్యలలో భాగంగా పలు అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగి నాలుగు గంటల పాటు మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. గాయపడిన ఉద్యోగులను సమీపంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ సహాయ చర్యలను వేగవంతం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల అసలు కారణాన్ని గుర్తించేందుకు పోలీసులు, అగ్నిమాపక అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బిల్డింగ్‌లో భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే అంశంపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటన నేపథ్యంలో హైదరాబాద్‌లోని కార్యాలయాలు, కమర్షియల్‌ బిల్డింగ్‌ల భద్రతా ప్రమాణాలను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రమాద నివారణ చర్యలపై మరింత దృష్టి సారించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Latest News

2.2 లక్షల ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కారు టోకరా: బీఆర్ఎస్

హామీ ఇచ్చి అమలు చేయకపోవడం కాంగ్రెస్‌ నైజమన్నది లోకవిదితం.. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం హామీ ఇచ్చి అమలు చేయకపోవడమే కాదు, వారిని నిట్టనిలువునా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS