Friday, June 6, 2025
spot_img

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయ్

Must Read

జూన్ 2న ఉదయం 10 గంటలకు విడుదల

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2025 రిజల్ట్స్ సోమవారం (జూన్ 2న) రానున్నాయి. ఉదయం పది గంటలకు ‘ఫైనల్ కీ’తోపాటు ఫలితాలను విడుదల చేయనున్నారు. అఫిషియల్ వెబ్‌సైట్‌ https://jeeadv.ac.in/లో చూడొచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌(బీఎస్‌), ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈ పరీక్ష నిర్వహించారు. ఈ ఫలితాలను ఐఐటీ కాన్పూర్‌ రిలీజ్ చేయనుంది. మే 18న 2 పూటలు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు 1.80 లక్షల మంది హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 40 వేల మంది ఈ టెస్ట్ రాశారు. 2024 జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో రిజర్వేషన్ల ప్రకారం కటాఫ్‌ మార్కులను బట్టి టోటల్‌గా 48,248 మందికి జోసా కౌన్సెలింగ్‌కి అవకాశం కల్పించారు. వాళ్లు మాత్రమే ఐఐటీల్లో సీట్లకు అర్హులు.

పోయినేడాది(2024-25లో) 23 ఐఐటీల్లో 17,760 సీట్లు ఉన్నాయి. ఇప్పటికే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రెస్పాన్స్‌ షీట్‌ను మే 22న, ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీని 26న రిలీజ్ చేశారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైన వారికి బీఆర్క్‌ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్(ఏఏటీ 2025) పెడతారు. ఈ పరీక్ష జూన్‌ 5న జరగనుంది. జూన్‌ 3న సాయంత్రం 5 గంటల నుంచి జోసా కౌన్సెలింగ్‌ ప్రారంభిస్తారు. ఈసారి 6 విడతల్లో కౌన్సెలింగ్‌ ఏర్పాటుచేశారు. సీట్ల కేటాయింపు.. తొలి విడత జూన్‌ 14, రెండో విడత జూన్‌ 21, మూడో విడత జూన్‌ 28, నాలుగో విడత జూలై 4, ఐదో విడత జూలై 10, ఆరో విడత జూలై 16.

Latest News

నేడు ‘కాళేశ్వరం‘ విచారణకు ఈటల

9న హరీష్‌రావు, 11న కేసీఆర్ ప్రస్తుత ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇవాళ (జూన్ 6 శుక్రవారం) ఉదయం 10 గంటలకు కాళేశ్వరం కమిషన్‌ విచారణకు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS