Friday, October 24, 2025
spot_img

తెలంగాణకు భారీ వ‌ర్ష సూచ‌న

Must Read

మూడు రోజులు కురిసే అవ‌కాశం
వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రిక‌

తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. ఈ నెల 29 వరకు కుండ‌పోత వాన ప‌డుతుంద‌ని అంచ‌నా వేసింది. కొన్ని జిల్లాల‌కు ఆరెంజ్‌, మ‌రికొన్ని జిల్లాల‌కు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని, అవి విస్తరించేందుకు పరిస్థితులు కూడా అనుకూలంగానే ఉన్నాయని తెలిపింది. వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవ‌కాశాలు ఉన్నాయి. ఇవాళ (సోమవారం) వికారాబాద్‌, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు ప‌డ‌తాయి. రేపు (మంగళవారం) ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. ఈ మేరకు వాతావ‌ర‌ణ కేంద్రం ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఎల్లుండి (బుధవారం) ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ అయింది. కరీంనగర్ పెద్దపల్లి, వరంగల్‌, హన్మకొండ, జనగాం, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. గురువారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాలో అతి భారీ వర్షాలు పడుతాయి. ఆయా జిల్లాల‌కు కూడా ఆరెంజ్‌ అలెర్ట్‌ని జారీ చేశారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This