మన మాటలు ఒక్కోసారి ఎదుటివారిని మానసికంగా గాయపరుస్తాయి. మనం కావాలని అలా అనకపోయినా ఆవేశంలోనో ఆవేదనతోనో వచ్చే మాటలు ఇతరులను తీవ్ర ఇబ్బందికి గురిచేస్తాయి. కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి. మాట అనేది నోటి నుంచి బయటికి వచ్చాక వెనక్కి తీసుకోవటం అసాధ్యం. అందువల్ల జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. మాట అన్నవాడు ఈజీగా మర్చిపోతాడేమో గానీ పడ్డవాడు మాత్రం అస్సలు మర్చిపోడు. జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. ఒంటి మీద పడే దెబ్బలను వైద్యం ద్వారా మాన్పొచ్చు గానీ మనసు మీద పడే దెబ్బలకు మందు లేదు.
బీవీఆర్ రావు