అమెరికాలోని డల్లాస్లో జరిగిన మిస్ యూఎస్ఏ తెలుగు ట్యాలెంటెడ్గా జాగాబత్తుల నాగచంద్రికారాణి సెలెక్ట్ అయింది. ఈమె స్వగ్రామం ఏపీలోని కృష్ణా జిల్లా గూడూరు మండలం పోలవరం. మే 25న నిర్వహించిన పోటీల్లో విజేతగా నిలిచి ప్రతిభ చాటుకుంది. చంద్రిక.. ఫ్లోరిడాలో ఎంఎస్ చదువుతోంది. విజయవాడలో ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన ఈమె కొన్నాళ్లు కాగ్నిజెంట్ సంస్థలో జాబ్ చేసింది. చంద్రిక విజయం పట్ల పేరెంట్స్, పోలవరం గ్రామస్తులు సంతోషం వెలిబుచ్చారు.