Friday, September 5, 2025
spot_img

రాహుల్ గాంధీతో మ‌హేశ్ కుమార్ గౌడ్ భేటీ

Must Read

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ (టీపీసీసీ) అధ్య‌క్షుడు మహేష్ కుమార్ గౌడ్.. ఆలిండియా కాంగ్రెస్ క‌మిటీ (ఏఐసీసీ) అగ్రనేత, లోక్‌స‌భ‌లో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఢిల్లీలో కుటుంబ సమేతంగా క‌లిశారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ రాహుల్ గాంధీతో రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే అందుబాటులో లేక‌పోవ‌టంతో టీపీసీసీ కార్య‌వ‌ర్గ నిర్ణ‌యం వాయిదా ప‌డింద‌ని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ నెల 30న మ‌రోసారి సీఎం రేవంత్‌తో క‌లిసి ఢిల్లీ వెళ్ల‌నున్నారు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని రాహుల్ గాంధీ చెప్పిన‌ట్లు మహేష్ కుమార్ గౌడ్ వెల్ల‌డించారు.

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img

More Articles Like This