Saturday, May 10, 2025
spot_img

8 మందికి ఒక రోజు జైలు శిక్ష

Must Read

బోధన్‌ పట్టణానికి చెందిన ఎనిమిది మందికి ఒక రోజు జైలు శిక్ష ఖరారైనట్లు సీఐ వెంకటనారాయణ పేర్కొన్నారు. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో పట్టణంలోని శక్కర్‌ నగర్‌కు చెందిన యాసీన్‌ కు మంగళవారం పట్టణంలోని న్యాయస్థానముల సముదాయంలో సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ శేష తల్ప సాయి ఎదుట హాజరుపరచగా ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు పట్టణ సీఐ తెలిపారు. పట్టణంలోని ఆజాం గుంజ్‌ లోని పక్క పక్క ఇల్లు గల కుటుంబ సభ్యులు గొడవ పడి పబ్లిక్‌ న్యూసెన్స్‌ చేస్తున్న ఇరు కుటుంబ సభ్యులు నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులను మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా వారికి కూడా ఒకరోజు జైలు శిక్ష విధించినట్లు ఆయన తెలిపారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS