- శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థుల ప్రతిభ ప్రదర్శనలు
- నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే వైజ్ఞానిక ప్రదర్శనలు – ఏజీఎం సతీష్
విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని ఏజీఎం సతీష్ అన్నారు. సైన్స్ ఫెయిర్ లో భాగంగా గడ్డి అన్నారం శ్రీ చైతన్య పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆర్ ఐ రవీందర్ రెడ్డి, కోఆర్డినేటర్ కామాక్షి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంలో పాఠశాల ప్రిన్సిపాల్ సువర్ణరేఖతో కలిసి వారు విద్యార్థుల నమూనాలను పరిశీలించారు విద్యార్థుల ఎంతో ఉత్సాహంగా వారి ప్రతిభ సృజనాత్మకతను కనబరిచే విధంగా నమూనాలను రూపొందించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, డీన్ రామశర్మ, కోఆర్డినేటర్ జితేందర్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.