Monday, April 14, 2025
spot_img

మాతృభాషకు విద్యార్థులను దూరం చేయొద్దు

Must Read

ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన వెంకయ్యనాయుడు

తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వచ్చిన వార్తలు విని విచారించానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మార్కుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం పునరాలోచన చేయాలని కోరారు. ఈ మేరకు ’ఎక్స్‌’లో ఆయన పోస్ట్‌ చేశారు. విద్యార్థులను మన మాతృభాషకు దూరం చేయడం మంచిది కాదు. సంస్కృతాన్ని బోధించడంలో తప్పు లేదు.. అదే సమయంలో మనదైన సంస్కృతిని అందిపుచ్చుకునే దిశగా అమ్మ భాష ఆలంబనగా నిలుస్తుంది. అందుకే జాతీయ విద్యావిధానం – 2020 సైతం దానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకుని, విద్యార్థులను మాతృభాషకు మరింత చేరువ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నానని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

Latest News

పొత్తులో పంచాయతీ.. తేల్చేది లేదు.. కూల్చేది లేదు..

మాకు సంబంధం లేదంటే, మాకు సంబంధం లేదంటున్న అధికారులు. ఇరిగేషన్, రెవిన్యూ తర్జన భర్జన. రావుస్ ఫార్మా లేబరేటరీస్ ప్రవేట్ లిమిటెడ్ పై నేటికి చర్యలు శూన్యం. ప్రభుత్వ ఆస్తులను...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS