Saturday, April 19, 2025
spot_img

హైదరాబాద్‌ వ్యాపార సంస్థల్లో ఈడీ సోదాలు

Must Read
  • సురానా – సాయి సూర్య డెవలపర్స్‌ కంపెనీల పై దాడులు
  • చెన్నై బ్యాంక నుండి వెల కోట్ల రుణాలు పొందినట్లు సమాచారం
  • సురానా గ్రూప్‌ పై ఇప్పటికే సీబీఐ కేసు

తెలంగాణలో మరోసారి ఈడీ అధికారుల సోదాలు తీవ్ర కలకలం సృష్టించాయి. సురానా ఇండస్ట్రీతో పాటు సాయి సూర్య డెవలపర్స్‌ కంపెనీల పై ఈడీ సోదాలు నిర్వహిస్తుంది, సురానాకి అనుబంధంగా సాయి సూర్య డెవలపర్స్‌ పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బోయిన్‌ పల్లి, సికింద్రాబాద్‌, జూబ్లీ హిల్స్‌, మాదాపూర్‌ ప్రాంతాల్లో ఈడి అధికారులు సోదాలు చేస్తున్నారు. చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక ఈడి బృందాలు నాలుగు ప్రాంతాల్లో ఈ సోదాలను నిర్వహిస్తున్నాయి. ఈ దర్యాప్తులో సంస్థల చైర్మన్‌లు, మేనేజింగ్‌ డైరెక్టర్లు ప్రధానంగా విచారణ ఎదురుకోనున్నారు. సురానా గ్రూపు చెన్నైలోని ప్రముఖ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయల రుణాలను పొందినట్లు సమాచారం. ఆ రుణాలను తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఇదివరకే సురానా గ్రూపుపై సీబీఐ కేసు కూడా నమోదు అయింది. ఇక సురానా గ్రూపుకు అనుబంధంగా ఉన్న సాయి సూర్య డెవలపర్స్‌ సంస్థపై కూడా అనుమానాలు వ్యక్తం కావడంతో, ఈడీ సోదాలు అక్కడి కార్యాలయాల్లోను కొనసాగుతున్నాయి. ఈ రెండు సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీలు, రుణ వినియోగంపై లోతుగా పరిశీలన జరుపుతోంది ఈడి. ఈ సోదాల నేపథ్యంలో హైదరాబాద్‌ వ్యాపార వర్గాల్లో కలకలం రేగింది.

Latest News

ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్.. చాలా ఆనందాన్ని ఇచ్చింది

అర్జున్ S/O వైజయంతి సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS