- పెళ్లి పనుల్లో తల్లులు బిసి.. పిల్లలు మృ*తి
- చేవెళ్ల మున్సిపల్లో ఘటన
ఓ ఇద్దరు తల్లుల ప్రేమ కారులో మాడిపోయింది. వినడానికి భారంగా అనిపించిన ఇదే నిజం పెళ్లి పనుల్లో బిసిగా ఉండీ పిల్లలను పట్టించుకోక పోవడంతో ఈ ధారుణం జరిగిందనీ స్థానికులు మండిపడుతున్నారు. కారులో ఇరుకున్న పిల్లలు ఎంత సమయం మృత్యువో పోరాడారో.. ఎలా తల్లడిల్లారో తలుచుకుంటేనే ప్రాంతమంతా నిశ్శబ్దమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దామరిగిద్ద చెందిన తెలుగు జంగయ్య కొడుకు రాంబాబు వివాహం ఈ నెల 30న నిశ్చయమైంది. దీంతో ఆయన అల్లుళ్లు, కూతుళ్లైన చేవెళ్ల మండలం పామెన గ్రామానికి చెందిన కావలి వెంకటేష్, జ్యోతి దంపతులు, వారి కుమార్తె తన్మయిశ్రీ (5), షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన మహేందర్, ఉమారాణి దంపతులు, వారి కుమార్తె అభినయశ్రీ (4) దామరిగిద్దకు వచ్చారు. సోమవారం కుటుంబసభ్యులు, బంధువులు పెళ్లి కార్డులు సెట్ చేస్తుండగా… మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో పిల్లలిద్దరూ ఆడుకుంటూ బయటికి వెళ్లారు. ఇంటి ఎదుట ఉంచిన మేనమామకు చెందిన ఆల్టో కారులో ఎక్కి ఆడుకుంటుండగా డోర్ లాక్ అయ్యింది. కుటుంబసభ్యులు గమనించకపోవడంతో అందులోనే ఉండిపోయారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పిల్లల కనిపించకపోవడంతో బయటికి వచ్చి చూడగా.. కారులో స్పృహ తప్పి పడి ఉన్నారు. వెంటనే లాక్ తీసి చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు చిన్నారులు అప్పటికే మృ*తి చెందినట్లు నిర్ధారించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.