Saturday, September 6, 2025
spot_img

IPL ఫైనల్.. రక్షణ దళాలకు అంకితం..

Must Read

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ 2025 జూన్ 3వ తేదీన అహ్మదాబాద్‌లో జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌ని భారత సాయుధ దళాలకు అంకితం ఇస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కి హాజరుకావాలంటూ ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌లను ఆహ్వానించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు. ఐపీఎల్ ఫైనల్ రోజే ముగింపు కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని జరిపేందుకు మూడు రక్షణ దళాల అధిపతులను, ఉన్నతాధికారులను, సైనికులను ఇన్వైట్ చేశారు.

ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలను కూల్చివేసిన మన హీరోలకు గౌరవ సూచకంగా ఐపీఎల్ ముగింపు కార్యక్రమాన్ని సాయుధ దళాలకు అంకితం ఇవ్వాలని నిర్ణయించాం అని దేవజిత్ సైకియా పేర్కొన్నారు. త్రివిధ దళాల శక్తిసామర్థ్యాలకు, ధైర్యసాహసాలకు, దేశానికి నిస్వార్థంగా చేస్తున్న సేవకు బీసీసీఐ సలాం చేస్తోందని తెలిపారు.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This