Thursday, October 23, 2025
spot_img

ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ స్పందించాలి: కాంగ్రెస్‌

Must Read

ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పదే పదే చెబుతున్నా మన ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నిలదీసింది. ఫ్రెండ్ డొనాల్డ్‌ భాయ్‌ చెబుతున్న మాటలపై మీరెందుకు పెదవి విప్పడం లేదు అని సూటిగా ప్రశ్నించింది. భారత్-పాక్‌ల మధ్య సమరాన్ని నేనే నిలువరించానంటూ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పటం గత 20 రోజుల్లో ఇది 9వ సారి అని కాంగ్రెస్ గుర్తుచేసింది. 3 దేశాల్లోని 3 నగరాల్లో డొనాల్డ్‌ భాయ్‌ చెప్పిందే చెబుతున్నారు. ‘ఇండియా‌-పాకిస్థాన్‌ మధ్య జరిగిన 4 రోజుల యుద్ధాన్ని అమెరికా ఎలా ఆపిందో ఆయన ప్రపంచానికి వివరించుకుంటూ వెళుతున్నారు. భారత్‌-పాక్‌లు రెండూ తనకు సమానమే అని చెబుతూ పోతున్నారు. కానీ.. దీనిపై పీఎం మోదీ మాట్లాడటంలేదు’అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్‌ పేర్కొన్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This