Saturday, September 6, 2025
spot_img

పలు దేశాల్లో భూకంపం

Must Read

నాలుగు దేశాల్లో భూకంపం సంభవించింది. టర్కీ, ఈజిప్ట్, సిరియా, గ్రీస్‌లో భూమి కంపించటంతో ప్రజలు భయాందోళనలతో ప్రాణాలను రక్షించుకునేందుకు పరుగులు తీశారు. ఈ క్రమంలో ఏడుగురు గాయపడ్డారు. తుర్కియేలో నిన్న (మంగళవారం) పొద్దున భారీ భూకంపం వచ్చింది. మర్మారి సమీపంలోని మధ్యధరా సముద్రంలో బుధవారం ఉదయం 2:17 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభవించాయి. వీటి తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 5.8గా నమోదైంది.

ఈ భూకంప ప్రభావం వల్ల గ్రీక్ దీవి సహా పలు ప్రాంతాల్లోనూ భూకంపం చోటుచేసుకుంది. పలు సిటీలు, టౌన్లు భూప్రకంపనలకు లోనయ్యాయి. సంబంధిత దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడికాలేదు. భూకంపం భారీగా వచ్చినప్పటికీ పెద్దగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని తుర్కియే డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ప్రెసిడెన్సీ తెలిపింది. తుర్కియేలో రెండేళ్ల కిందట 7.8 తీవ్రతతో భూమి కంపించటంతో 50 వేల మందికి పైగా చనిపోయారు.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This